#కాలాతీతవ్యక్తులు
మనకి తెలుగు సాహిత్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కొన్ని పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం వారి మనసుకు హత్తుకుంటుంది. చదివిన ప్రతిసారి ఒక్కో కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది. అలాంటి పుస్తకాలలో ఒకటి పి. శ్రీదేవి గారు రచించిన "కాలాతీతవ్యక్తులు". మొదటి ప్రచురణలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన నవల ఇది. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు వారి యొక్క వ్యక్తిత్వాలను, ఆలోచనలను, ఒక తరంలో వచ్చిన పరిణామాలను తెలుపుతుంది ఈ నవల. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పును, వివాహవ్యవస్థలో రావలసిన మార్పును గురించి తెలుపుతూ మన ఆలోచనావిధానాన్ని మెరుగుపరిచే ఈ నవలను గురించి విశ్లేషణలో వినండి.
–
#కాలాతీతవ్యక్తులు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kalatheeta-vyaktulu
Listen to a part of Chapter 1 of #KalatheetaVyaktulu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.