#ఎమ్మెల్యే ఆత్మకథ
1956లో ప్రధమంగా ప్రచురింపబడిన ఈ నవల, తెలుగులో ఆనాటి రాజకీయాలపై చేసిన తొలి వ్యంగ్య రచనగా పేర్కొనబడింది. హాస్య రస ప్రధానమైనదని చెప్పబడినప్పటికీ, ఆ నాటి పాఠకులలో ఏపాటి హాస్యరసాన్ని ఒలికించిందో గానీ, ఈ నాటి రాజకీయ పరిస్థితులతో పోల్చుకుంటే హాస్యం పొంగిపొర్లటం తధ్యం. ఈ దేశంలో రాజకీయాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం, దేశం కోసం త్యాగాలు, అనంతరం భోగాలు. అది మరింత వికృతమై పార్టీలు, సిద్ధాంతాలూ, నైతిక విలువలూ పట్టింపు లేకుండా పచ్చని చోట మేయడం వెచ్చని చోట పడుకోవడం ఆన్న చందంగా ఎప్పటికప్పుడు ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటేనే రంగంలో ఉండగలరు. అలా చేయలేని వారికి రాజకీయంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యంలో కొత్త శాసన సభ్యుల ఉత్పత్తి-వృద్ధి-వ్యవహార-పరిణామ సరళిని పట్టి ఇస్తుంది ఈ ఆత్మకథ. అధికారం, ప్రజాసేవ వీటిని గురించి చక్కని ఆలోచలను ప్రేరేపిస్తుంది ఈ ఆత్మకథ. ఈ నవలా రచయిత శ్రీ మన్నవ గిరిధరరావు గారు వృత్తి రీత్యా అధ్యాపకులు. గుంటూరు హిందూ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులుగా 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1968లో గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై 1978 వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. యువభారతి పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనేక హాస్య, విద్యావిషయక ప్రసంగాలు చేశారు. వారు చేసిన అనేక రచనలనుంచి ఈ నవలను ఎంచుకుని శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి ‘ఎమ్మెల్యే ఆత్మకథ'.
–
#ఎమ్మెల్యే ఆత్మకథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-mla-aatmakatha
Listen to a part of Chapter 1 of #MLAAatmakatha. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.