#రాజశేఖర చరిత్రము
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు రచయిత, పత్రికా సంపాదకులు, అన్నిటికి మించి గొప్ప సంఘ సంస్కర్త అని మనకు తెలుసు. కానీ ఏ పరిస్థితులు ఆయనను సంఘ సంస్కరణకు పురిగొల్పాయో అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన 'రాజశేఖర చరిత్రము' నవల వినాలి. ‘రాజశేఖర చరిత్రము’ లో రాజశేఖరుడు గారి అమాయకత్వము, అవివేకము ఆ కుటుంబం పడిన అష్టకష్టా లన్నింటికీ మూలం. సంఘంలోని కపటులు, కల్లరులు, కుక్షింభరులు, స్తుతి పాఠకులు, డాంబికులు, ఏ విధంగా అమాయకులను బాధించి, తాము బాగపడుతున్నారో, అంధ విశ్వాసాల వల్ల, అవివేకపు ఆచారాల వల్ల కొన్ని కుటుంబాలు ఎలా నాశనమైపోతున్నాయో ఈ నవలలోని సంఘటనల వల్ల తెలుసుకోవచ్చు. తెలుగువారి ఆచార వ్యవహారాలు, వాటి బాగోగుల వివరణ, ఆహ్లాదపరచే వ్యంగ్యం, హద్దులు దాటని హాస్యంతో, సర్వులకూ అవసరమైన సద్గుణాలను సలక్షణమైన శైలిలో సామాన్యులకు సయితం అర్ధమయ్యేలా వర్ణించి వాటికి అభిముఖత్వం కల్పించిన ఆ నవలారాజం ప్రప్రథమంగా శ్రవణ రూపంలో. వినండి - రాజశేఖర చరిత్రము - మీ ‘దాసుభాషితం’ యాప్ లో.
–
#రాజశేఖర చరిత్రము శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-rajasekhara-charitramu
Listen to a part of Chapter 1 of #RajasekharaCharitramu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.