Listen

Description

#కాంచనమృగం

మాలతీ చందూర్

ప్రపంచంలో ఎవరికైనాసరే వారి జీవితంలో కొన్ని చిన్నవి, మరచిపోలేనివి అయిన సంఘటనలు వెన్నాడుతూ ఉంటాయి. మనం వాటిని ఎంత మరచిపోవాలన్నా ఎక్కడో ఒకచోట మనకు గుర్తు వచ్ఛే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఆ వయసులో భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా తమ వెనుకటి జీవితాన్ని, కష్టాలను, అందులో వారి స్నేహ బంధాన్ని తలచుకుంటూ హాయిగా జీవిస్తారు. ఈ కథలోని ముఖ్య పాత్ర అయిన సుందరమ్మ గారిది భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో కూడిన ఎంతో అందమైన కుటుంబం. ఒకసారి సుందరమ్మ గారు అస్వస్థత వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటారు. ఆమె పూర్తిగా తేరుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనకు సపర్యలు చేసిన నర్సు ఎలిజిబెత్ తమ్ముడి మెడలో తన గొలుసు వేసి అతన్ని చూసిన ఉద్వేగాన్ని తట్టుకోలేక చనిపోతారు. అనాకారి, అసమర్ధుడు అయిన ఎలిజిబెత్ తమ్ముడికి ఆ గొలుసు ఎందుకిచ్చారు? అతన్ని చూసి ఎందుకంత ఉద్వేగానికి సుందరమ్మ లోనయ్యిందో వినండి.

---

#కాంచనమృగం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/search?query=kanchana

--- 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.