వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది.
ఇందులో భాగంగా
ఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' , దాని వల్ల పర్యావరణం పై పడుతున్న దుష్ప్రభావం - వీటిపై పోరాడుతున్నారు గత రెండు దశాబ్దాలుగా శ్రీ.శుక్లా.
ఈ ఇంటర్వ్యూలో ఆయన , హస్దేవ్ అరణ్యం ప్రత్యేకత గురించి , ఆదివాసీల జీవితం గురించి, చట్టంలో ఆదివాసీల హక్కుల గురించి, ఆదివాసీల చట్టపరమైన, శాంతియుత పోరాటాన్ని గురించి వివరించడం జరిగింది.ప్రస్తుతం ఇంటర్వ్యూ హిందీ లో ప్రసారం చెయ్యడం జరుగుతోంది. తొందరలో తెలుగు అనువాద పాఠం ఆడియో ద్వారా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.
Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.